జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: మోదీ

56చూసినవారు
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: మోదీ
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా శుక్రవారం ఉధంపూర్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా మోదీ ప్రసంగించారు. తనపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మోదీ హామీ ఇచ్చారు.