జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీల పెంపు, కామన్ డైట్ మెనూను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి వెంట జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.