న్యాయం కోసం ఆమె అలుపెరుగని పోరాటం

17620చూసినవారు
న్యాయం కోసం ఆమె అలుపెరుగని పోరాటం
టైమ్స్ 100 మంది ప్రభావశీరుల జాబితాలో దేశం తరుపున తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నంది స్థానం దక్కించుకుంది. మానవ, మహిళల, రాజ్యాంగ హక్కుల కోసం ఆమె నిత్యం పోరాడుతోంది. విదేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలను వదులుకుంది. 2016లో దివ్యాంగ హక్కుల కార్యకర్త జీజా ఘోష్‌ కేసును వాదించి గెలిచింది. విమానాల్లో దివ్యాంగులకు సకల సౌకర్యాలు కల్పించేలా చేసింది. భోపాల్ గ్యాస్ బాధితులకు పరిహారం, నిర్భయ ఘటన తర్వాత అత్యాచార నిరోధక బిల్లులలో కీలక పాత్ర ఆమెది.