ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి తీహార్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ అందించారు. ఈ విషయాన్ని ఆప్ మంగళవారం ధృవీకరించింది. సోమవారం కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ 217గా ఉన్నట్టు ఇన్సులిన్ డోస్ ఇచ్చినట్లు సమాచారం. అయితే షుగర్ లెవల్ 200 దాటితే తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇవ్వవచ్చని ఎయిమ్స్ వైద్యుల బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.