బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు

84చూసినవారు
బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు
AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక అస్పియా అంజుమ్ సమ్మర్ స్టోరేజి ట్యాంకులో శవమై తేలడం సంచలనం సృష్టించింది. బాలికను హత్య చేసి సమ్మర్ స్టోరేజి ట్యాంకులో పడవేసినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. చిన్నారి తండ్రికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్