ప్రయాణికుడి వల్ల విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

54చూసినవారు
ప్రయాణికుడి వల్ల విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
టర్కీ నుంచి లండన్‌లోని గాట్విక్‌కు వెళ్లే ఈజీజెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ఓ ప్రయాణికుడు మత్తులో ఉండి తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి వాగ్వాదాన్ని ఆపలేదు. దీంతో ఏథెన్స్‌లోని ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం అతడిని ఎయిర్‌పోర్టు అధికారులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్