సాగర్ జలాలను తక్షణమే విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో శుక్రవారం జరిగిన మండల రైతుసంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ సాగర్ ఆయకట్టు కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయని, సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన కాల్వ మరమ్మతులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలన్నారు.