కొత్తగూడెం పట్టణంలో వర్ష ప్రాభావిత ప్రాంతాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం పర్యటించారు. గాజులరాజం బస్తి, బూడిదగడ్డ, కూలీలైన్, హానుమాన్ బస్తిల్లో ఈదురుగాలలు, వడగండ్ల వానతో దెబ్బ తిన్న ఇండ్లను పరిశీలించి, జరిగిన నష్టాన్ని బాదితులను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ చేపట్టిన విద్యుత్ స్తంబాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను పరిశీలించారు.