నేటి నుంచి సిబ్బందికి శిక్షణ
కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ సిబ్బందికి మంగళవారం నుంచి మే3 వరకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలో శిక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ శిక్షణకు సిబ్బంది విధిగా హాజరు కావాలని సూచించారు. భద్రాచలం, పినపాక, ఇల్లెందు పీఓ, ఏపీఓలకు కూడా శిక్షణ ఉంటుందని తెలిపారు.