ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

55చూసినవారు
ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
యూపీలోని ఎటా జిల్లాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. కొత్వాలి దేహత్ ప్రాంతంలోని నాగ్లా పాటి గ్రామంలో సోమవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాష్ కుష్వాహ(20), కరిష్మా కుష్వాహా(18)తో ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ఇంటి నుంచి ఇద్దరూ పారిపోయారు. పెద్దలు వీరిని ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ట్యాగ్స్ :