ఐపీఎల్లో భాగంగా నేడు లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. గతేడాది ఈ రెండూ పంజాబ్లో మ్యాచ్ ఆడాయి. లక్నో 257 పరుగులు చేయగా.. పంజాబ్ 201 రన్స్ చేసి ఓడింది. అయితే, లక్నో పిచ్ మందకొడిగా ఉండటంతో ఈరోజు మ్యాచ్లో ఆ స్థాయిలో పరుగులు రాకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం పంజాబ్ 2 మ్యాచ్లు ఆడి ఒక విజయాన్ని సాధించగా.. లక్నో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.