ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై శ్రద్ధ: మహబూబ్ నగర్ కలెక్టర్

62చూసినవారు
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై శ్రద్ధ: మహబూబ్ నగర్ కలెక్టర్
ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ధరణి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ధరణి దరఖాస్తుల పెండింగ్ పై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్