జిల్లా కేంద్రమైన గద్వాలలోని ఆర్టీసీ బస్టాండులో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. రాత్రిళ్ళు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సమస్య నెలకొంది. బుధవారం తెల్లవార్లు ప్రయాణికులు చీకట్లో మగ్గారు. దీపాలను వెలిగించాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.