జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన రాజోలి సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక జెసిబి, 3 ట్రాక్టర్ లను రాజోలి పోలీసులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నది వద్ద అక్రమంగా ఇసుకను తవ్వుతుండగా పోలీసులు దాడి చేసి వాటిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.