ప్రజావాణి దరఖాస్తులకు సకాలంలో పరిష్కారం చూపాలి: నారాయణపేట కలెక్టర్

64చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులకు సకాలంలో పరిష్కారం చూపాలి: నారాయణపేట కలెక్టర్
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ సూచించారు. సోమవారం నారాయణపేట కల్లెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల తో కలిసి స్వీకరించారు. సమస్యలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.