పుస్తకాలు అజ్ఞానపు చీకటిని తొలగించే దారి దీపాలు..!

80చూసినవారు
పుస్తకాలు అజ్ఞానపు చీకటిని తొలగించే దారి దీపాలు..!
పుస్తకాలు అజ్ఞానపు చీకటిని తొలగించే దారి దీపాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. కొద్ది రోజులుగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో పుస్తకాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రముఖ కవులు వల్లభాపురం జనార్ధన, ఖాజామైనుద్దీన్లు దాదాపు వేయి పుస్తకాలను వేదిక సభ్యులకు అందజేశారు. విలువైన పుస్తకాలు ఇళ్లలో నిరుపయోగంగా ఉండకుండా చదివేందుకు ఆసక్తి గల వారికోసం వితరణ చేయడం అభినందనీయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్