మళ్లీ మొదటి నుంచి సీఎం జగన్ కేసుల విచారణ

83చూసినవారు
మళ్లీ మొదటి నుంచి సీఎం జగన్ కేసుల విచారణ
సీబీఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు నిన్నటి వరకు గడువు ఇచ్చింది. ఈ సమయంలోనే జడ్జి రమేష్ బాబు బదిలీ అయ్యారు. ఈయన 2022 మే నెల నుంచి 130 డిశార్చి పిటిషన్లపై వాదనలు వింటున్నారు. అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్లు అన్నింటిపై కొత్త జడ్జి మళ్లీ మొదటి నుంచి వాదనలు విననున్నారు.

సంబంధిత పోస్ట్