చిరుతపులితో వ్యక్తి ఫైట్ (వీడియో)

3600చూసినవారు
రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. భదర్ మెట్వాలా గ్రామంలో ఓ జంతువును చిరుత వేటాడింది. దానిని గ్రామస్తులు తరిమికొట్టేందుకు యత్నించారు. దీని కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టుపై చిరుతపులి దాడి చేసింది. కాలును కరిచింది. అయితే ఆ జర్నలిస్టు ధైర్యంగా చిరుతపులితో పోరాడాడు. తర్వాత గ్రామస్థులు దానిని తాళ్లతో బంధించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.