ప్రచారంలో ప్రజా సమస్యల ఊసెత్తని మోదీ : ప్రియాంక గాంధీ
By Gaddala VenkateswaraRao 69చూసినవారుకేరళలోని వయనాడ్ లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ .. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతల ప్రసంగాలు చూస్తుంటే అసంబద్ధమైన అంశాలను లేవనెత్తడం కనిపిస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన వాస్తవ అంశాలను మరుగునపరిచేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగం, ధరల మంట గురించి కాషాయ నేతలు అసలు నోరు మెదపరని మండిపడ్డారు.