పవన్ కళ్యాణ్‌పై ఈసీకి మరో ఫిర్యాదు

50699చూసినవారు
పవన్ కళ్యాణ్‌పై ఈసీకి మరో ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని బాపట్ల జిల్లా వేట్లపాలెంకు చెందిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ పతాకాన్ని వినియోగించారని, ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కూటమి కార్యకర్తలు చొచ్చుకొని వెళ్లినట్లు తెలిపారు.