ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తప్పులు చేయకుండా జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తహసిల్దారులను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారం పై బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి దరఖాస్తుకు ఆర్ ఎస్ ఆర్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎక్కడైనా కుటుంబ తగాదాలకు సంబంధించి సమస్య వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆధారాలతో సహా నమోదు చేయాలని చెప్పారు.