
ఇందుగుల రైతు బిడ్డకు రాష్ట్ర ర్యాంకు
రైతు కుటుంబంలో జన్మించి చదువులో ర్యాంకు సాధించింది. మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రైతు కల్లు నవీన్ రెడ్డి కవిత దంపతుల కుమార్తె కల్లు అక్షర మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర ర్యాంకు సాధించింది. ఉత్తమ మార్కులు సాధించిన అక్షర ను కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు మండల ప్రజలు అభినందించారు.