ఎడపల్లి మండలం జానకంపేట శివారులో గుర్తు తెలియని సుమారు 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు ఎడపల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.