ఇంటింటికి కాంగ్రెస్ నాయకుల ప్రచారం
జక్రాన్ పల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.