కంటైనర్ను ఢీకొన్న బైక్..
జాక్రాన్ పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బాపుసింగ్ తన కూతురి ఆధార్ కార్డు నమోదు కోసం ఆర్మూర్ వెళ్లాడు. అనంతరం పడకల్ తండాకు తిరిగి వస్తుండగా ముందు వెళ్తున్న కంటైనర్ను డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో కంటైనర్ను బైక్ ఢీకొని బాపుసింగ్తో పాటు అతడి కూతరు ఐశ్వర్య కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని ఎస్సై తిరుపతి పరిశీలించారు. గాయాలపాలైన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.