బిజెపి అభ్యర్థికి మద్దతుగా కోటపాటి నరసింహం విస్తృత ప్రచారం
జక్రాన్ పల్లి మండలంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా శుక్రవారం బిజెపి రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహం నాయుడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండలంలోని తొర్లికొండ, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలుసుకొని కేంద్రంలో మరొక్కసారి నరేంద్ర మోడీని బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాలలో భారత్ తలెత్తుకొని తిరగాలంటే మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం గెలవాల్సిన అవసరం ఉందని ప్రసంగించారు.