చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోతంగల్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు బోధన్ మండలం మినార్ పల్లికి చెందిన నవీన్ గా పోలీసులు గుర్తించారు. పెళ్లైన ఆరు నెలలకే విడాకులు తీసుకోవడంతో మద్యానికి బానిసైన నవీన్ ఆదివారం పోతంగల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.