చిహ్నంలో వీటికే చోటు.. తెలంగాణ రాజముద్ర ఫైనల్..!

73చూసినవారు
చిహ్నంలో వీటికే చోటు.. తెలంగాణ రాజముద్ర ఫైనల్..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక పేర్లు, చిహ్నల విషయంలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమయంలో రాజముద్ర ఫోటో ఒక‌టి వైరల్ గా మారింది. ప్రభుత్వం మూడింటిలో ఒక చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భారత జాతీయ చిహ్నం.. అమరవీరుల స్థూపం.. వరి కంకులు.. ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో రాసి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.