తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి రూ.కోటి చెక్ అందించిన పవన్‌ కల్యాణ్‌

53చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి రూ.కోటి చెక్ అందించిన పవన్‌ కల్యాణ్‌
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసానికి పవన్‌ ఇవాళ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని ఇటీవల పవన్‌ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును నేడు సీఎంకు ఆయన అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్