రసాయనాలతో కల్తీ పాల తయారీ.. నిందితుడు అరెస్ట్ (వీడియో)

73చూసినవారు
ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ముక్తాపూర్ ప్రశాంత్ అనే వ్యక్తి కల్తీ పాలు తయారు చేసి పలు చోట్ల విక్రయిస్తున్నాడు. నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం ఉదయం కల్తీ పాలు తయారు చేస్తుండగా పట్టుకున్నారు. 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం, ధోల్పూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ 8 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.