ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

57చూసినవారు
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆరంభంలోనే తమకు ఎన్నికల్లో అండగా నిలిచిన అన్ని వర్గాలను సంతృప్తి పరిచే పనిలో బిజీగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. నాలుగేళ్లలో తొలిసారిగా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి. నిన్న దాదాపు అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు క్రెడిట్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నాలుగేళ్లలో ఇలా ఉద్యోగులకు జీతాలు క్రెడిట్ కావడం ఇదే తొలిసారి అంటున్నారు.

సంబంధిత పోస్ట్