ఇంద్రప్రస్థ కాలనీ గాంధీ చిల్డ్రన్స్ పార్క్ పున ప్రారంభోత్సవం

3212చూసినవారు
ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీలో గాంధీ చిల్డ్రన్స్ పార్క్ పున ప్రారంభోత్సవం ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు వేసవికాలం శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. గాంధీ చిల్డ్రన్స్ పార్క్ తమ స్వంత నిధులతో ఏర్పాటు చేయడం హర్షణీయమని స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పేర్కొన్నారు. తమ స్వంత నిధులతో పిల్లలకి ఒక నెల మొత్తం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి సమ్మర్ క్యాంపు నిర్వహించినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇలాగే ముందుకు వచ్చి తమ అభివృద్ధి పనులను కొనసాగించాలని కాలనీవాసులకు పిలుపునిచ్చారు. ఇంకా కాలనీ ప్రజల సహాయ సహకారాలతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని నిర్వాహకులు లయ పేర్కొన్నారు. పార్క్ ఏర్పాటుకు అభివృద్ధికి తోడ్పాటు పడ్డ కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్