వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చూడాలని బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ విద్యుత్ అధికారులను కోరారు. శుక్రవారం 22వ డివిజన్లోని యాదవ మిత్ర కాలనీ, భారతీనగర్, వినాయక్ నగర్ కాలనీ, గాయత్రీనగర్, ఆదర్శ్ నగర్ కాలనీల్లో ఆయన పర్య టించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై విద్యుత్ ఏఈకి సమాచారం అందించి, వెంటనే లైన్మెన్ సమస్యపై సమీక్షించారు.