దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

75చూసినవారు
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
దసరా పండుగ సెలవులతో హైదరాబాద్ నగరమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు భారీగా రద్దీ పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అలర్ట్ అయింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్