ఓపెన్ స్కూల్ లో పది, ఇంటర్మీడియట్ లో చేరేందుకు బుధవారం చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించి దరఖాస్తు తీసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.