రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది వీరే
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు రాణినగర్కు చెందిన అల్లీ సాహెబ్ (58), షేక్ సురోజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమాన్ (4), రెహనా బేగం (40)గా గుర్తించారు.