ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ, బడ్జెట్ కేటాయింపుల అంచనాపై సమీక్షించారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి ఆదేశాలు జారీచేశారు. హల్ప్హెల్ప్ డెస్కుల బలోపేతం, పోలీస్ స్టేషన్లలో మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు.