నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

800చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 522.82 పాయింట్లు క్షీణించి 64,049.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 159.60 పాయింట్లు క్షీణించి 19,122.20కు చేరింది. కోల్ ఇండియా, టాటా స్టీల్, హిండాల్కో ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. అయితే ఇన్ఫోసిస్, సిప్లా, ఎన్‌టిపిసి, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.18 వద్ద స్థిరపడింది.