దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటలకు సెన్సెక్స్ 37 పాయింట్లు పెరిగి 78,090 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 23,739 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్లో అల్ట్రాటెక్ సిమెంట్, ICICI, L&T, కోటక్ మహీంద్రా లాభాల్లో ఉండగా, JSW స్టీల్, M&M, టాటా స్టీల్, HDFC బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.45 వద్ద ప్రారంభమైంది.