దుబాయ్‌లో ఏపీ వాసికి భారీ జాక్‌పాట్

80చూసినవారు
దుబాయ్‌లో ఏపీ వాసికి భారీ జాక్‌పాట్
దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న ఏపీకి చెందిన ఓ వ్యక్తికి భారీ జాక్‌పాట్ తగిలింది. 2019 నుంచి అక్కడి నేషనల్ బాండ్లలో తన డబ్బును పొదుపు చేస్తున్న బోరుగడ్డ నాగేంద్రం (46) దాదాపు రూ.2.25 కోట్ల నగదును గెలుచుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. జీవనోపాధి కోసం నాగేంద్రం 2017లో యూఏఈ వెళ్లారు. 2019 నుంచి ఆయన సుమారు 2,271 ప్రతి నెలా అక్కడి బాండ్లలో పొదుపు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్