లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
By Somaraju 70చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 22,558 వద్దకు చేరింది. సెన్సెక్స్ 486 పాయింట్లు ఎగబాకి 74,339 వద్దకు చేరింది. యాక్సిస్ బ్యాంక్, SBI, JSW స్టీల్, నెస్లే, సన్ ఫార్మా, ITC, NTPC, ఎం అండ్ ఎం, ICICI బ్యాంక్ షేర్లు లాభాల్లోకి వెళ్లాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లోకి జారుకున్నాయి.