మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు ధరావత్ నాగేశ్వరరావు ఘన సన్మానం

874చూసినవారు
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు ధరావత్ నాగేశ్వరరావు ఘన సన్మానం
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన ధరావత్ నాగేశ్వరరావును ఎస్.టి సెల్ మండల అధ్యక్షుడు ధరావత్ బాబ్జీ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం డేగ బాబు ఫంక్షన్ హాల్ లో జరిగిన అభినందన సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మార్కెట్ కమిటీలో తమ సామాజిక వర్గానికి డైరెక్టర్ పదవి ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా చైతన్య వంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరావతి సాయి భద్రాజీ బాబు కీమా, బాల శ్రీనుబాబు ,లింగ, హనుమంతు ,వెంకటేష్ ,మిత్రులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.