మరో 5 రోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 మెగా టోర్నీ ప్రారంభంకాబోతుంది. ఈ క్రమంలో భారత జట్టు అమెరికా పయనమైంది. తాజాగా టీమిండియా ఈ పొట్టి ప్రపంచకప్ కోసం న్యూయార్క్ చేరుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముగియడంతో ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు తప్ప మిగిలినవాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ నెట్టింట షేర్ చేయగా, వైరల్గా మారింది.