మత్తు చాక్లెట్ల ఘటన.. ముఠాను పట్టించిన హెచ్ఎం

1534చూసినవారు
మత్తు చాక్లెట్ల ఘటన.. ముఠాను పట్టించిన హెచ్ఎం
హైదరాబాద్ నగర శివారు కొత్తూరు ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు మత్తు చాకెట్లు తిన్న ఘటనలో హెచ్ఎం చూపిన చొరవ ప్రశంసనీయం. పిల్లలు క్లాస్ రూంలోనే మూత్ర విసర్జన, అసభ్యంగా ప్రవర్తించడం గమనించిన హెచ్ఎం అంగూర్ నాయక్ వారితో స్నేహంగా ఉంటూ గంజాయి చాక్లెట్లు తిని ఇలా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. డీఈవో, పోలీసుల సహకారంతో పాన్ డబ్బాలో మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను పట్టించారు. దీంతో హెచ్ఎం గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.