ఫలించిన వ్యూహం.. ఒడ్డుకు ఒక బోటు (వీడియో)

53చూసినవారు
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియలో వ్యూహం ఫలించింది. మూడు బోట్లలో ఒక దాన్ని ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. రెండు భారీ పడవలకు అదనంగా మరో రెండింటిని తీసుకొచ్చారు. నీటిలో మునిగిన బోటుకు ఇనుప కొక్కేలు, తాళ్లు కట్టి బోటును బయటకు లాగారు. మిగిలిన రెండు బోట్లను ఇవాళ బయటకు తీస్తారు. ఈ పనులను బెకమ్ సంస్థ, కాకినాడ అబ్బులు బృందం, విశాఖ సీలియన్ బృందం చేపడుతోంది.

సంబంధిత పోస్ట్