ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని జగన్ అన్నారని, ఇప్పుడు జగన్కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు జగన్ స్వస్తి చెప్పాల్సిందేనని, చంద్రబాబుపై వ్యక్తిగత దూషణ చేసినవారిని వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. త్వరలో సజ్జల జైలుకు వెళ్లడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు.