రాజస్థాన్లోని రాజ్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు యువకులను గోసంరక్షకులు దారుణంగా కొట్టారు. సోను బిష్ణోయ్, సుందర్ బిష్ణోయ్ అనే ఇద్దరు వ్యక్తులు పికప్ ట్రక్ లో లోడ్ తో వెళ్తున్నారు. అయితే ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారని అనుమానించి వారిపై దాడి చేశారు. అయితే చివర్లో ట్రక్ టార్పాలిన్ను తెరిచి పరిశీలించగా అందులో నిమ్మకాయలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై చూరు పోలీసులు కేసు నమోదు చేశారు.