తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ

80చూసినవారు
తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. స్వామివారి దర్శనానికి 5 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.