కొట్టుకుపోయిన కల్వర్టు.. నిలిచిన రాకపోకలు (వీడియో)

74చూసినవారు
ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో గార్గేయ నదిపై ఏర్పాటు చేసిన కల్వర్టు కొట్టుకుపోయింది. మూడు చోట్ల కల్వర్టులు ధ్వంసమైనట్లు సమాచారం. దాంతో పోలికిమాకులపల్లి, ఎర్రగుంతలపల్లి, ఇర్లపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి కల్వర్టులు రిపేర్ చేయాలని, రవాణా సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్