
వాటర్ బకెట్లో పడి 15 రోజుల ఆడ శిశువు మృతి
TG: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. 15 రోజుల ఆడ శిశువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిన్నారిని పడుకోబెట్టి స్నానానికి వెళ్లి.. తిరిగొచ్చే సరికి బకెట్లో శవమై కనిపించిందని చిన్నారి తల్లి పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.